
కీర్తి సురేష్.. దక్షిణాది చిత్రపరిశ్రమలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. మహానటి సినిమాతో ప్రశంసలు అందుకుంది. ఈమూవీతో ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం మారిపోయింది.

దీంతో తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవలే దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది.ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ చిత్రంలో నటిస్తుంది.

అయితే సినిమాల గురించి కాకుండా.. వ్యక్తిగత విషయాలతోనే నిత్యం వార్తలలో నిలుస్తుంటుంది కీర్తి.. ముఖ్యంగా ఈబ్యూటీ ప్రేమ, పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి.

అయితే ఇప్పటికే తమ కూతురి పెళ్లి, ప్రేమ గురించి కీర్తి తల్లిదండ్రలు క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కీర్తి తన పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై అసహనం వ్యక్తం చేసింది.భోళా శంకర్ సినిమానే కాకుండా.. కీర్తి తమిళంలో మామన్నన్ చిత్రంలో నటించింది.

ఇందులో ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించగా.. ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుకను చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కీర్తికి మరోసారి పెళ్లి గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా ? అని ప్రశ్నించగా.. కీర్తి క్లారిటీ ఇచ్చింది.

“నా పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చాను. మీరంతా నా పెళ్లి గురించే ఎందుకు అడుగుతున్నారు ? నా పెళ్లిపై మీరెందుకు అంత ఆసక్తి చూపుతున్నారు.?

నా వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నాక నేనే స్వయంగా ప్రకటిస్తాను. దీని గురించి ప్రతిసారి అడగాల్సిన అవసరం లేదు.. ఇక ప్రతిసారి ప్రెస్ మీట్ లో ఇలాంటి ప్రశ్నలు వద్దు” అంటూ సీరియస్ అయ్యింది. దీంతో ఎట్టకేలకు కీర్తికి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేసింది.