
ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్ హీరోయిన్ల కంటే ఎక్కువగా విలన్లకే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరోయిన్లను మించిన ఫిట్నెస్, గ్లామర్ లుక్స్ తో స్మాల్ స్క్రీన్ పై సత్తా చాటుతున్నారు కొందరు ముద్దుగుమ్మలు. అందులో గాయత్రి సింహాద్రి ఒకరు. ఈ పేరు చెబితే తెలుగు అడియన్స్ అస్సలు గుర్తుపట్టలేరు.

గాయత్రి సింహాద్రి అలియాస్ జ్యోత్స్న. ఈ పేరు చెబితే ఠక్కున గుర్తుపట్టేస్తారు. కార్తీక్ దీపం 2 సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అచ్చ తెలుగమ్మాయి.. బుల్లితెరపై విలనిజంతో ఔరా అనిపిస్తుంది. మరోవైపు గ్లామర్ ఫోటోషూట్లతో నెటిజన్లను కట్టిపడేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

జ్యోత్న్స పాత్రలో గాయత్రి యాక్టింగ్ వేరేలెవల్ అని చెప్పాలి. ఆమె యాక్టింగ్, లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక విలన్ పాత్రలో ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ సీన్లో ఆమె కనిపించినా ఫ్యామిలీ అడియన్స్ కోపంతో రగిలిపోతుంటారు. అంతగా తన పాత్రలో ఒదిగిపోయింది.

ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్లో విలన్ పాత్రలో నటిస్తున్న ఈ అమ్మడు.. నిజానికి సినిమాల్లో హీరోయిన్ కావాలనుకుంది. మ్యాడ్ వంటి సినిమాలో గుర్తింపు లేని పాత్ర చేసింది. కానీ ఆమెకు పాపులారిటీ తెచ్చిపెట్టింది మాత్రం కార్తీక దీపం 2 సీరియల్.

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది గాయత్రి సింహాద్రి. రోజూ గ్లామరస్ ఫోటోలతో నెట్టింట రచ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు బ్లాక్ కలర్ శారీలో మతిపోగొట్టేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆమె లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.