
కాంతారా సినిమాతో నేషనల్ వైడ్గా పాపులర్ అయ్యాడు రిషబ్ శెట్టి. ప్రస్తుతం ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రెడీ చేసే పనుల్లో బిజీగా ఉన్నాడీ హీరో.

అయితే కాస్త విరామం లభించడంతో ఫ్యామిలీ మ్యాన్గా మారిపోయాడు. తన భార్య పిల్లలతో కలిసి పచ్చటి పొలాల వెంట సరదాగా కలియ తిరిగాడు

రిషబ్ శెట్టి తన సతీమణి ప్రగతి శెట్టి, ఇద్దరు పిల్లలందరూ కలర్ ఫుల్ దుస్తుల్లో కనిపించి కనువిందు చేశారు. ఈ ఫొటోలను ప్రగతి శెట్టి తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది.

ప్రస్తుతం రిషబ్ శెట్టి ఫ్యామిలీ ఫొటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి. క్యూట్ ఫ్యామిలీ అంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కాగా ప్రస్తుతం తన దృష్టంతా కాంతారా 2 పైనే ఉందంటున్నాడు రిషబ్ శెట్టి. ఈ సినిమా తర్వాతే కొత్త ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తానంటున్నాడు.