
కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమా సప్త సాగరాలు దాటి సినిమా. ఇందులో రక్షిత్ శెట్టి హీరోగా నటించగా.. కథానాయికగా అందరి దృష్టిని ఆకర్షించింది రుక్మిణి వసంత్. బీర్బల్ సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన ఈ వయ్యారి హిందీలో అప్ స్టైర్స్ అనే సినిమాలో నటించింది.

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ వయ్యారికి ఇప్పుడు సోషల్ మీడియా భారీ ఫాలోయింగ్ వచ్చేసింది. సప్త సాగరాలు దాటి సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది ఈ హీరోయిన్. ఈ సినిమా ఆమెకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది.

దీంతో తెలుగుతోపాటు కన్నడలోనూ ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కన్నడలో శ్రీమురళీకి జోడిగా భఘీర చిత్రంలో నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. అలాగే నిఖిల్ సరసన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రంలో నటిస్తుంది.

సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ దీపావళి కానుకగా విడుదల కానుంది. వీటితోపాటు కన్నడ, తెలుగులో మరిన్ని ఆఫర్స్ అందుకుంది. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి జోడిగా ఏస్ అనే సినిమాలో నటిస్తుంది.

తాజాగా రుక్మిణి తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. జీన్స్ అండ్ వైట్ టాప్ లో ఎంతో సింపుల్ గా కనిపిస్తూనే కాటుక కళ్లు.. నిషా చూపులతో చంపేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటో చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.