బాహుబలి సినిమా టైమ్కు ఇండియన్ స్క్రీన్ మీద రెండు మూడు వందల కోట్ల వసూళ్లే పెద్ద విషయం. ఇక టాలీవుడ్లో అయితే వంద కోట్ల మార్క్ భారీ అచ్చీవ్మెంట్. ఆ టైమ్లో వంద కోట్లకు పైగా బడ్జెట్తో ఓ సినిమాను ప్లాన్ చేసే సాహసం చేసి సక్సెస్ అయ్యారు రాజమౌళి. ఆ విజయమే మిగతా నిర్మాతలకు భారీగా ఖర్చు చేసేందుకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది.
బాహుబలి ఇచ్చిన నమ్మకంతో కేజీఎఫ్ 2 బడ్జెట్ను భారీగా పెంచేశారు కన్నడ మేకర్స్. తొలి భాగం ఘన విజయం సాధించటంతో, వందల కోట్ల వసూళ్లు మన స్క్రీన్ మీద సాధ్యమే అన్న నమ్మకం రావటంతో... యష్ మార్కెట్ను మించి ఖర్చు చేసి సక్సెస్ అయ్యారు కన్నడ నిర్మాతలు. ఆ తరువాత కూడా ఒక్కో సినిమాతో బడ్జెట్ లెక్కలు మారిపోతున్నాయి. ట్రిపులార్, బ్రహ్మాస్త్ర, పఠాన్ సినిమల బడ్జెట్ 500 కోట్లకు పైనే. అంత భారీగా తెరకెక్కించారు కాబట్టే ఈ సినిమాలు గ్లోబల్ రేంజ్లో సందడి చేశాయి. ఈ సినిమాల్లోనూ ఒకటి రెండు మాత్రమే వెయ్యి కోట్ల మార్క్ను టచ్ చేశాయి.
కమర్షియల్గా సక్సెస్ అవ్వటం వేరు... అవార్డు వేడుకల్లో సత్తా చాటటం వేరు. ముఖ్యంగా విశ్వ వేదికల మీద మన పేరు మారు మోగాలంటే.. జస్ట్ కంటెంట్ ఆ రేంజ్లో ఉంటే సరిపోదు. అంతకు మించిన ప్రమోషన్ కూడా కావాలి. అప్పుడే వెస్ట్రన్ ఆడియన్స్.. ఇండియన్ సినిమాను పట్టించుకుంటారు. ప్రజెంట్ ఈ విషయంలోనూ సీరియస్గా ఫోకస్ చేస్తున్నారు మన మేకర్స్.
బాహుబలి తరువాత ట్రిపులార్తో మరో సెన్సేషన్ సృష్టించారు రాజమౌళి. అయితే ఈ సారి సక్సెస్ సౌండ్ గ్లోబల్ రేంజ్లో వినిపించింది. వసూళ్ల పరంగానే కాదు.. అవార్డులు, రివార్టుల పరంగానూ ట్రిపులార్ సరికొత్త రికార్డులు సెట్ చేసింది. బాహుబలి సినిమాను నేషనల్ మూవీగా ప్రొజెక్ట్ చేయటంలో సూపర్ సక్సెస్ అయిన రాజమౌళి... ట్రిపులార్ను గ్లోబల్ ఆడియన్స్కు చేరువ చేయటంలోనూ అంతే సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా సినిమాను ఆస్కార్ దాకా తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా 50 కోట్ల వరకు ఖర్చు చేశారన్న అంచనాలు ఉన్నాయి.
ఇప్పుడు నా వంతు అంటూ ముందుకు వస్తున్నారు జవాన్. ఆల్రెడీ బాక్సాఫీస్ను షేక్ చేసిన షారూఖ్, అట్లీ కాంబో ఇప్పుడు ఆస్కార్ను టార్గెట్ చేస్తోంది. ప్రజెంట్ సక్సెస్ సెలబ్రేషన్స్లో ఉన్న అట్లీ, ఆస్కార్ ఎంట్రీ విషయంలో షారూఖ్తో డిస్కస్ చేస్తున్నామన్నారు. అంతా ఓకే అయితే ట్రిపులార్ తరహాలో జవాన్ కూడా విశ్వ వేదిక మీద సత్తా చాటడం పక్కా అంటున్నారు నార్త్ ఆడియన్స్.