ప్రస్తుతం ఉన్న యూత్ కి జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.. ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ తోనే ఆమె మిలియన్ల కొద్దీ అభిమానులని సొంతం చేసుకుంది. శ్రీదేవి కుమార్తె అనే బ్రాండ్ ఉన్న తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.
బాలీవుడ్ లో నాలుగు పదులు వయసు దాటినప్పటికీ కొందరు హీరోయిన్లు కూడా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు. అయితే జాన్వీ కపూర్ కూడా గ్లామర్ ఎంత ముఖ్యమో బాగా తెలుసు. అందుకే ఈ ముద్దుగుమ్మ జిమ్ కి వెళ్లి మంచిగా ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది.
జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు.
అయితే ప్రస్తుతం జాన్వీ బాలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తోంది. ప్రస్తుతం జాన్వీ రాజ్ కుమార్ రావు తో కలసి మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే చిత్రంలో నటిస్తోంది. ఇది క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రియల్ లైఫ్ లవ్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.
మే 31న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండడంతో జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావు ప్రమోషన్స్ తో హోరెత్తిస్తున్నారు. ఇప్పుడు క్రేజీ శారీలో జాన్వీ కపూర్ కళ్ళు ఇచ్చింది. రెడ్ అండ్ బ్లూ కలర్ లో ఉన్న శారీ, మహి అని రాసి ఉన్న బ్లౌజ్ లో జాన్వీ కపూర్ మెరిసింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.