
నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ నభా నటేష్. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటించాడు. ఈ సినిమా నిరాశపరిచినా .. నభా నటేష్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

నన్ను దోచుకుందువటే సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. నటన అందం ఉన్నా కూడా సూపర్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది ఈ బ్యూటీ. అదే సమయంలో పూరిజగన్నాథ్ సినిమాలో ఛాన్స్ అందుకుంది నభా నటేష్ .

రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో పాటు గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కవ్వించింది నభా నటేష్. ముఖ్యంగా కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు దింపింది ఈ వయ్యాయి భామ.

ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత నభా నటేష్ కు మంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ సాలిడ్ హిట్ మాత్రం పడలేదు. రవితేజ లాంటి బడా హీరోల సినిమాల్లో ఛాన్స్ వచ్చినా కూడా హిట్ అందుకోలేకపోయింది. చివరిగా అల్లుడు అదుర్స్ అనే సినిమా చేసింది.

ఇక సోషల్ మీడియాలో ఈ అమ్ముడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన స్టన్నింగ్ ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు మతిపోగొడుతున్నాయి. వయ్యారాలు ఒలకబోస్తూ దర్శక నిర్మాతలను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. మరి ఈ బ్యూటీకి అవకాశం ఎప్పుడొస్తుందో చూడలి.