
ప్రభాస్, దీపికా పదుకోణె, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఇండియన్ ఎపిక్ డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ 'కల్కి 2898 ఏడి'. ఇందులో దిశా పటాని, కమల్ హాసన్, బ్రాహ్మణానందం కీలక పాత్రల్లో నటించారు.

ఇందులో బుజ్జి అనే కార్ కి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ అందించారు. రాజేంద్ర ప్రసాద్, అలనాటి నటి శోభన, అన్నా బెన్, శాశ్వత ఛటర్జీ, పశుపతి ఇతర పాత్రధారులు, కథానాయకి మాళవిక నాయర్ ఉత్తర పాత్రలో కనిపించింది. ఈ పాత్ర సినిమాలో కీలకమైనది.

ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ దీనిపై ఉన్న హైప్ మరింత పెంచాయి. ఈ చిత్రం విడుదలైన పాట కూడా ఆకట్టుకుంది. ఈ సినిమా జూన్ 27న విడుదల కానున్న సందర్భంగా ఆదివారం 6 గంటలకు ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ చేసారు.

అయితే బుకింగ్ మై షోలో ఈ బుకింగ్ సమయంలో ప్రభాస్ కల్కికి బదులుగా 2019లో వచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్ కల్కి సినిమాకి 6 టికెట్స్ బుకి చేసినట్టు వార్త వైరల్ అవుతుంది. దీనిపై స్పందించిన హీరో రాజశేఖర్ నాకు అస్సలు సంబంధం లేదు అంటూ ఫన్నీ ట్వీట్ చేస్తూ.. ప్రభాస్ కల్కి టీం ను విష్ చేసారు.

అస్సలు ఏమి జరిగిందంటే.. సీనియర్ హీరో రాజశేఖర్ కల్కి సినిమా 2019లో జూన్ 28న విడుదలైంది. దీనికి ముందురోజు రాత్రి ప్రీమియర్ షోలు వేశారు. 27 జూన్ 2019 రాత్రి 10:15కి హైదరాబాద్ భ్రమరాంబ థియేటర్ లో బుక్ చేసిన ప్రీమియర్ షో టికెట్ ను ప్రభాస్ కల్కి మూవీకి సింక్ చేస్తూ ఓ మీమర్ ఫన్నీ మీమ్ వేసాడు. దీంతో ఇది వైరల్ అయింది. ఇది నిజం కాదు.