
సైలెంట్గా ఉన్న సినిమా ఒక్కసారిగా న్యూస్లోకి రావడానికి ఒక్కటంటే ఒక్క మాట చాలు.. తారక్లాంటి హీరో ఆ సినిమా గురించి మాట్లాడితే క్షణాల్లో వైరల్ కంటెంట్ రెడీ అయినట్టే కదా... మామూలు సినిమాకే ఈ పరిస్థితి అంటే.. ఆల్రెడీ ఫుల్ పాపులర్ అయిన కాంతార లాంటి సినిమా గురించి స్పెషల్గా చెప్పాలా.. చెప్పండి

దేవర సినిమాకు కౌంట్డౌన్ మొదలుపెట్టేశారు ఫ్యాన్స్. జస్ట్ ఇంకో పాతిక రోజులు ఓపిక పడితే మా హీరో స్క్రీన్ మీద చెలరేగిపోవడాన్ని చూసేయొచ్చు అని ఇష్టంగా ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఈ టైమ్లోనే ఫ్యామిలీకి సమయం కేటాయించి, కర్ణాటకలో టెంపుల్ టూర్ చేస్తున్నారు తారక్.

లేటెస్ట్ గా మూకాంబిక ఆలయాన్ని సందర్శించారు ఎన్టీఆర్. ఆయనతో పాటు రిషబ్శెట్టి కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. కాంతార ప్రీక్వెల్లో తారక్ నటిస్తున్నారా? అనే అనుమానాలకు సరిగ్గా ఇక్కడే క్లారిటీ దొరికేసింది.

రిషబ్శెట్టి తనకోసం ఓ మంచి కేరక్టర్ రాస్తే, కాంతార ప్రీక్వెల్లో నటించడానికి తనకేం అభ్యంతరం లేదని చెప్పారు తారక్. రిషబ్ డైరక్షన్లో తారక్ నటిస్తారనే వార్తలకు మరోసారి ఊతం వచ్చినట్టు అయింది.

కాంతార ప్రీక్వెల్ని ఇంటర్నేషనల్ రేంజ్లో తెరకెక్కించి, ఆస్కార్కి పంపాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో తారక్ ఇచ్చిన స్టేట్మెంట్... సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచేస్తోంది. ఇంతకీ తారక్ కోసం రిషబ్ కేరక్టర్ క్రియేట్ చేస్తున్నారా? లేదా? అనే వార్తలు కూడా ఊపందుకున్నాయి.