
దాదాపు దశాబ్ద కాలంగా వెండితెర మీద కొనసాగుతున్నా.. స్టార్ హీరోయిన్గా ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు గ్లామర్ క్వీన్ రాశీఖన్నా. అందుకే... ట్రెండ్ మార్చి డిజిటల్ ఆడియన్స్కు చేరువయ్యేందుకు కష్టపడుతున్నారు.

పెద్దగా అప్డేట్స్ లేకపోవటంతో మీడియా అటెన్షన్ను గ్రాబ్ చేసేందుకు గ్లామర్ షోతో రచ్చ చేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద బిజీగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం టెంపరేయర్ రెయిజ్ చేస్తున్నారు టాలీవుడ్ బ్యూటీ రాశీఖన్నా.

వరుస ఫోటో షూట్లతో హల్ చేస్తున్న రాశీ, ఇప్పుడు హాట్నెస్ ఓవర్ లోడెడ్ అన్న రేంజ్లో రెచ్చిపోతున్నారు. మూవీ అప్డేట్స్తో న్యూస్లో కనిపించకపోయినా... గ్లామర్ అప్డేట్స్తో మాత్రం గట్టిగానే సందడి చేస్తున్నారు.

నటిగా రొటీన్ మోడ్రన్ గర్ల క్యారెక్టర్స్ మాత్రమే వస్తుండటంతో సోషల్ మీడియాలో వేరియేషన్స్ చూపిస్తున్నారు రాశీ. తాజాగా ఈ బ్యూటీ వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అల్ట్రా మోడ్రన్గా టూ హాట్ అనిపించే రేంజ్లో కెమెరాల ముందుకు వచ్చారు రాశీ.

అయితే ఈ రేంజ్లో కష్టపడుతున్నా అనుకున్న రేంజ్లో ఆఫర్స్ అయితే రావటం లేదు. ప్రస్తుతం తెలుగులో ఒకే ఒక్క సినిమా చేస్తున్నారు ఈ బ్యూటీ. హిందీలో రెండు, తమిళ్లో రెండు ప్రాజెక్ట్స్ రిలీజ్కు రెడీ అవుతున్నాయి.

రాశీ గ్లామర్ షో, వెండితెర అవకాశాలకు హెల్ప్ అవ్వకపోయినా... డిజిటల్లో అయినా అవకాశాలు తెచ్చిపెడుతుందని నమ్ముతున్నారు.

ఇప్పటికే అజయ్ దేవగన్ లీడ్ రోల్లో తెరకెక్కిన 'రుద్ర : ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్'లో నెగెటివ్ రోల్లో నటించిన రాశీ, షాహిద్ కపూర్ ఫర్జీలోనూ ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ ప్లే చేశారు. ఛాన్స్ ఇస్తే డిజటల్లో ప్రయోగాలకు రెడీ అంటున్నారు ఈ బ్యూటీ.