Rajeev Rayala |
Updated on: Jan 16, 2022 | 9:01 PM
నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ నిధి అగర్వాల్.
మొదటి సినిమాతో అందంతోపాటు అభినయం తోనూ ఆకట్టుకుంది ఈ అందాల భామ. సవ్యసాచి సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన నిధి నటనకు మంచి మార్కులే పడ్డాయి.
ఆతర్వాత మరోసారి అక్కినేని కాంపౌండ్ లో నటించింది ఈ భామ. అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది.
ఆతర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా అమ్మడి క్రేజ్ ను అమాంతం పెంచేసింది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటనతోనే కాదు గ్లామర్ పరంగానూ అలరించింది నిధి.
ఇక ఈ అమ్మడు తమిళ్ లోనూ సినిమాలు చేస్తుంది. ఇప్పటికే అక్కడ జయం రవి సరసన ఓ సినిమా శింబు సరసన ఓ సినిమా చేసింది ఈ చిన్నది.
ఇక ఇప్పుడు తెలుగులో మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటించిన హీరో సినిమాలోనూ నిధి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
నిధి అగర్వాల్ ఇప్పటి వరకు 50 లక్షల నుండి 80 లక్షల మద్య పారితోషికం అందుకునేది. కాని హీరో సినిమాలో అశోక్ గల్లాకు జోడీగా నటించేందుకు ఈ అమ్మడు ఏకంగా కోటిన్నర అందుకున్నట్లుగా తెలుస్తోంది.