
నెక్స్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో ఆడియన్స్ కి హలో చెప్పడానికి రెడీ అవుతున్నారు నిధి అగర్వాల్. అవి రెండూ కూడా రీజినల్ సినిమాలు కాదు.. ప్యాన్ ఇండియా రేంజ్లో పాపులర్ అయిన మూవీసే.

ఎన్నాళ్లుగానో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న నిధి అగర్వాల్కీ, ఈ రెండు మూవీస్ ఎంత ప్లస్ అవుతాయి.? నిధి అగర్వాల్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ గుర్తొచ్చే సాంగ్ ఇదే.

ఇస్మార్ట్ శంకర్లో దిమ్మాక్ ఖరాబ్ అంటూ దుమ్మురేపిన పాటే. తెలుగులో అడపాదడపా సినిమాలు చేసినా క్రేజీ ప్రాజెక్టుల్లోనే మింగిల్ అవుతున్నారు ఈ బ్యూటీ.

ఎందుకలా అని అడిగితే.. అన్నీ సినిమాలూ ఒప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. మంచి ప్రాజెక్టులను చూసి సెలక్ట్ చేసుకుంటూ ఉంటా అనే ఆన్సర్ ఇస్తున్నారు నిధి.

ఎందుకలా అని అడిగితే.. అన్నీ సినిమాలూ ఒప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. మంచి ప్రాజెక్టులను చూసి సెలక్ట్ చేసుకుంటూ ఉంటా అనే ఆన్సర్ ఇస్తున్నారు నిధి.

ఈ ఏడాది నిధి నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. అయితేనేం.. బేఫికర్గా ఉంటాను. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నేను చేసిన రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ మిమ్మల్ని పలకరించడానికి రెడీ అవుతున్నాయన్నది నిధి మాట.

అందులో ఒకటి డార్లింగ్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్. రాజాసాబ్లో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ ఇద్దరు నాయికలు. అటు పవర్స్టార్ హరిహరవీరమల్లులోనూ ఇద్దరు నాయికలు. కమర్షియల్ సినిమాల్లో ఎంత మంది హీరోయిన్లున్నారన్నది ఎప్పుడూ పట్టించుకోకూడదు.

మన రోల్ ఏంటనే విషయంలో క్లారిటీ ఉంటే చాలు అని ఓపెన్ అయ్యారు ఈ బ్యూటీ. ప్యాన్ ఇండియా స్టార్తోనూ, పవన్ స్టార్తోనూ అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి లెక్కలేసుకుంటూ కూర్చుంటే ఎలా.. అనే ఒపీనియన్ వినిపిస్తోంది అమ్మణి మాటల్లో.