టాలీవుడ్లో అవకాశాలు ఇచ్చినా.. అందలమెక్కించినా.. ఎందుకో తెలియదు కానీ ముద్దుగుమ్మల మనసు మాత్రం బాలీవుడ్పైనే ఉంటుంది. తాజాగా మరో భామ కూడా ఇదే చేస్తున్నారు.
తెలుగులో వరసగా ఆఫర్స్ ఇస్తున్నా.. కోట్ల పారితోషికం అందిస్తున్నా.. ఆమె మాత్రం ఛలో బాలీవుడ్ అంటున్నారు. మరి ఇంతకీ ఎవరా హీరోయిన్.? పదేళ్ళ నుంచి బాలీవుడ్లో ఉన్నారు మృణాళ్ ఠాకూర్.
కానీ అక్కడ్నుంచి ఆమెకు ఒరిగిందేమీ లేదు.. అరడజన్ వరకు సినిమాలు.. దాని తర్వాత సీరియల్స్ చేసినా మృణాళ్కు గుర్తింపు రాలేదు. అలాంటి సమయంలో సీతా రామం సినిమాతో స్టార్ అయ్యారు ఈ బ్యూటీ.
హాయ్ నాన్నతో తెలుగులో రేంజ్ పెరిగిపోయింది. ఫ్యామిలీ స్టార్తో నిరాశ పర్చినా కూడా మృణాళ్ ఠాకూర్కు తెలుగు ఇండస్ట్రీలో ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. కానీ ఈమె మాత్రం సౌత్ వైపు అస్సలు చూడట్లేదు.
ఏదో మొహమాటానికి రెండు సినిమాలు చేసారేమో అనిపిస్తుంది మృణాళ్ తీరు చూస్తుంటే..! బాలీవుడ్పై అంతగా ప్రేమ చూపిస్తున్నా.. అక్కడ్నుంచి ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయారు ఈ బ్యూటీ.
తాజాగా సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయడానికి ఓకే అన్నారు మృణాళ్. సిద్దాంత్ చతుర్వేది హీరోగా నటించబోయే ఈ చిత్రానికి రవి ఉద్యావర్ దర్శకుడు.
శ్రీదేవి చివరి సినిమా మామ్కు ఈయనే దర్శకుడు. ఈ ప్రాజెక్ట్ కోసమే సౌత్ సినిమాల వైపు చూడట్లేదు మృణాళ్. మరి ఈమె తీసుకుంటున్న ఈ నిర్ణయం కెరీర్పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.