టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ మార్చ్ 30 మంగళవారం తన 38వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్బంగా తన ఫ్యామీలితో కలిసి బర్త్ డే సెలబ్రెషన్స్ చేసుకున్నాడు యంగ్ హీరో.
ఈ వేడుకలలో స్పెషల్ అట్రాక్షన్గా సింగర్ సునీత, రామ్ వీరపనేని నిలిచారు. వారితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు నితిన్ దంపతులు.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఏడాది నితిన్ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చెక్ ఆశించినంతగా విజయం సాధించలేదు.
ఇటీవల విడుదలైన రంగ్ దే మూవీ పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది.
తాజాగా నితిన్ పుట్టిన రోజు సందర్బంగా.. తన తదుపరి సినిమా 'మాస్ట్రో' టైటిల్తోపాటు ఫస్ట్లుక్ను విడుదల చేసింది చిత్రయూనిట్.
ఇందులో నితిన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నటిస్తుండగా.. మిల్కీబ్యూటీ తమన్నా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.