
అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఈ మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత వరసగా ఆఫర్స్ అందుకుంది.

కెరీర్ స్టార్టింగ్లో టాలీవుడ్ ను షేక్ చేసిన ఈ బ్యూటీ, స్టార్ హీరోల సరసన ఆఫర్స్ అందుకొని అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు తగ్గడంతో, బాలీవుడ్ వైపు కన్నేసి అక్కడ తన గ్లామర్తో అందరినీ ఆకట్టుకుంది.

అంతే కాకుండా బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నానీ నీ ప్రేమించి, పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ ఓ వైపు సినిమాలు, మరో వైపు తన బిజినెస్లలో ఫుల్ బిజీ అయిపోయింది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ చిన్నది తాజాగా తన లేటెస్ట్ ఫొటో షూట్తో కుర్రకారు మనసు దోచేసుకుంది.

మెరూన్ కలర్ ట్రెండీ డ్రెస్లో తన కైపెక్కించే చూపులతో ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.