
నిజంగానే అభిమానులే లేకపోతే హీరోలెక్కడ ఉంటారు చెప్పండి..? అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యాన్స్ను హీరోలు పబ్లిక్ ఈవెంట్స్లో కలవడం అనేది అసాధ్యంగా మారిపోయింది.

ముఖ్యంగా పుష్ప 2 ఘటన తర్వాత ఈవెంట్స్ మరింత వేడెక్కాయి. అందుకే ఫ్యాన్స్నే తమ దగ్గరికి పిలుచుకుంటున్నారు హీరోలు. అప్పట్లో చిరంజీవి నెలలో నాలుగో ఆదివారం ఇలాగే ఫ్యాన్స్ కోసం కేటాయించేవారు.


తేజ్ మాత్రమే కాదు.. ఈ మధ్యే రామ్ చరణ్ కూడా ఫ్యాన్స్ను కలిసారు. కలవడమే కాదు.. కడుపు నిండా భోజనం పెట్టి పంపారు చరణ్. ప్రస్తుతం బుచ్చిబాబు ఓ సినిమా చేస్తున్నారు చెర్రీ. షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

సంక్రాంతికి వస్తున్నాం టైమ్లో వెంకటేష్, ఆ మధ్య ధమాక విడుదలకు ముందు రవితేజ ఇలాగే స్పెషల్గా ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ మీట్కు అభిమానుల నుంచి కూడా ఊహించని స్పందన వస్తుంది.