అంతకుముందు ఆ తర్వాత చిత్రంతో అరంగేట్రం చేసింది ఈషా రెబ్బా.
మొదటిచిత్రంతోనే అందం, అభినయంతో మంచి మార్కులు కట్టేసింది. బందిపోటు, అమీ తుమీ, దర్శకుడు వంటి చిత్రాల్లో నటించింది.
తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేతలో పూజాహెగ్డే సోదరిగా మెప్పించింది. 2021లో ఆహాలో 3 రోజెస్ వెబ్ సిరీస్ తో ఆకట్టుకుంది ఈ చిన్నది.
ప్రస్తుతం సుదీర్ బాబు మామ మశ్చేంద్ర చిత్రంలో కథానాయకిగా చేస్తుంది.
తాజాగా కథా కేళి అనే సినిమాలో నటిస్తుంది ఈ అమ్మడు.ఇందులో ఈషారెబ్బ ప్రధాన పాత్రలో నటిస్తోంది.
తెలుగులో పలు సినిమాలు చేసినప్పటికీ ఈ అమ్మడు గుర్తింపు తెచుకోలేకపోయింది.
దాంతో తమిళ్ లోనూ అవకాశలకోసం ట్రై చేసింది. ఓయ్ అనే సినిమా తమిళ్ లో చేసింది. అలాగే మలయాళంలోనూ ఓ సినిమా చేస్తుంది.