
సెలబ్రెటీలకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం మనం చూస్తే ఉంటాం పొద్దున్న లేచిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో సెలబ్రెటీల సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పటికే హీరోలు, హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట కోకొల్లలుగా ఉన్నాయి. సోషల్ మీడియాలో స్టార్ హీరోలు, హీరోయిన్స్ కు సంబందించిన లేటెస్ట్ ఫోటోల దగ్గర నుంచి చిన్ననాటి ఫోటోల వైరల్ అవుతుంటే ఉన్నాయి.

ఈ ఫోటోలు చూస్తూ అభిమానులు, నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఇలా రేర్ ఫోటోలు నెట్టింట చాలానే ఉన్నాయి. అలాగే పైన కనిపిస్తున్న ఫోటో కూడా తెగ వైరల్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ ఇద్దరికి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ తమ సినిమాలతో దూసుకుపోతున్నారు. మధ్యలో ఉన్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? రీసెంట్ గా వెయ్యికోట్ల కొల్లగొట్టి భారీ హిట్ అందుకుంది.

టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరు లెజెండ్రీ హీరోలు.. ఈ ఇద్దరూ తమ సినిమాలతో ప్రేక్షకులను విపరీతముగా ఆకట్టుకున్నారు. ఇప్పటికి కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరితో ఉన్న ఓ చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఇంతకూ ఆ ఇద్దరి మధ్య ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.?

ఆమె కూడా టాలీవుడ్ లో సెలబ్రిటీ కూతురు. ఆమె ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కూతురు ప్రియాంక దత్. అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్ సతీమణి ఆమె. నాగ్ అశ్విన్ కల్కి సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. ఇక ప్రియాంక దత్ కూడా నిర్మాతగా రాణిస్తుంది. త్రీ ఏంజల్స్ స్టుడియో అనే బ్యానర్ పై ఆమె పలు సినిమాలను నిర్మించింది.

బాణం, ఓం శాంతి, శక్తి , సారొచ్చారు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలను నిర్మిచారు. అలాగే బాలు, జై చిరంజీవ అనే సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరించింది ప్రియాంక దత్. బాణం సినిమాకు గాను ప్రియాంక వెండి నంది పురస్కారం అందుకుంది. చిన్న సినిమాలతో పాటు బడా సినిమాలను కూడా నిర్మిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ప్రియాంక. ఇక ఇప్పుడు ప్రియాంక ఓల్డ్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.