
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ మరో సౌత్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ ట్రిపులార్తో సౌత్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ,

ఇప్పుడు మరో పాన్ ఇండియా డైరెక్టర్తో వర్క్ చేసేందుకు రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్లో టాప్ స్టార్గా ఉన్న ఆలియా భట్, ట్రిపులార్తో సౌత్ ఎంట్రీ ఇచ్చారు.

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ కావటంతో చిన్న పాత్రే అయినా నటించేందుకు ఓకే చెప్పారు ఈ క్యూటీ.

ట్రిపులార్లో ఆలియా పాత్రకు మంచి రెస్పాన్స్ రావటం, ఆ ఇమేజ్ ఆమె మార్కెట్కు కూడా హెల్ప్ అవ్వటంతో సౌత్లో రెగ్యురల్గా సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారు ఈ బ్యూటీ.

తాజాగా మరో పాన్ ఇండియా డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమాలో ఆలియా నటించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. లేడీ ఓరియంటెడ్ కథతో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్న నాగీ,

ఆ సినిమాలో లీడ్ రోల్కు ఆలియాను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో కల్కి 2ను పట్టాలెక్కించడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది.

అందుకే ఈ లోగా ఆలియాతో ఓ మూవీని రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాకపోయినా..

నాగీ నెక్ట్స్ మూవీ 2025 మధ్యలోనే స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ వార్తలపై మరింత క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.