
బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే గ్లామర్ రచ్చ గురించి చెప్పక్కర్లేదు. నిత్యం మోడ్రన్, గ్లామర్ హాట్ ఫోటోలతో నెట్టింట అగ్గిరాజేస్తుంది. ఇటీవలే తెలుగులోనూ ఓ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆమె ఎవరో తెలుసా.. ?

ఆ వయ్యారి మరెవరో కాదండి.. హీరోయిన్ దిశా పటానీ. గతేడాది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన కల్కి 2898 ఏడీ చిత్రంలో నటించి హిట్టుకొట్టింది. అయితే కల్కి సినిమా దిశాకు మొదటి తెలుగు మూవీ కాదు.

2015లో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన లోఫర్ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంది.

దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ఎంఎస్ ధోని సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ మారిపోయింది. అందులో దిశా యాక్టింగ్ చూసి అడియన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమాతో ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించింది. అటు సినిమాలు.. ఇటు యాడ్స్ అంటూ ఫుల్ బిజీ అయిపోయింది. అలాగే సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది.