
సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత గ్లామర్ రోల్స్ కాకుండా వైవిధ్యమైన పాత్రలు ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ? ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.

తెలుగులో చేసింది ఒక్క సినిమానే.. కానీ ఊహించని స్టార్ డమ్ సంపాదించుకుంది. ఆ బ్యూటీ మరెవరో కాదండోయ్.. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్. ప్రస్తుతం ఈ అమ్మడు వయసు 27 సంవత్సరాలు మాత్రమే. కానీ ఇప్పటికే కోట్లు సంపాదించిందని టాక్. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందట.

అతిలోక సుందరి శ్రీదేవి, బోనీ కపూర్ దంపతుల పెద్ద కూతురు జాన్వీ కపూర్. ధడక్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే విజయం సాధించింది. ఆ తర్వాత హిందీలో వరుస సినిమాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తుంది.

ఇటీవలే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతోపాటు తనదైన నటనతో తెలుగు వారి హృదయాలు గెలుచుకుంది. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన పెద్ది చిత్రంలో నటిస్తుంది. అలాగే దేవర 2లోనూ భాగం కానుంది.

మరోవైపు హిందీలోనూ వరుస సినిమాల్లో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా జాన్వీకి సంబంధించిన చిన్ననాటి ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. తెలుగులో మరిన్ని సినిమాల్లో నటించనుందట ఈ అమ్మడు.