చలన చిత్ర పరిశ్రమలో తమ అందంతో, అభినయంతో తమకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. కాలక్రమంలో తమకు చిత్ర పరిశ్రమలో పరిచయమైన వ్యక్తులకు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విధి వక్రీకరించి తక్కువ సమయంలోనే ఈ హీరోయిన్లు తమ భర్తలను పోగొట్టుకున్నారు.
క్వీన్ రేఖ ఢిల్లీ పారిశ్రామికవేత్త ముఖేష్ అగర్వాల్ను వివాహం చేసుకున్నారు. పెళ్లయిన కొద్ది రోజులకే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖేష్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే ప్రశ్న ఇప్పటికీ మిస్టరీగా ఉంది. అనంతరం రేఖ 1973లో హీరో వినోద్ మెహ్రాను మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు బీ టౌన్ లో ఓ టాక్. అయితే అతను కూడా గుండెపోటుతో మరణించాడు
నటి కైకేషన్ పటేల్ వ్యాపారవేత్త ఆరిఫ్ పటేల్ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, అర్హాన్, నుమైరే. సంతోషంగా సాగుతున్న వైవాహం జీవితంలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. భర్త, పిల్లలతో సంతోషంగా సాగుతున్న ఆనందం కైకేషన్ పటేల్ కు ఎంతో కాలం నిలవలేదు. ఆరిఫ్ 2018లో అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు.
సునీల్ దత్ 'మన్ కా మీట్'తో లీనా చందావర్కర్ బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆమె 1975లో సిద్ధార్థ్ బందోద్కర్ను వివాహం చేసుకుంది. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే చనిపోయాడు. ఆ తర్వాత లీనా 1980లో కిషోర్కుమార్ను వివాహం చేసుకుంది. పెళ్లయిన ఏడేళ్ల తర్వాత అతను కూడా చనిపోయాడు. అప్పటికి లీనా వయసు 37 ఏళ్లు.
భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ.. వెండి తెరపై అక్షయ్ కుమార్ 'సౌగంధ్' చిత్రంతో అడుగు పెట్టింది. 1999లో నటుడు సిద్ధార్థ్ రాయ్ని వివాహం చేసుకుంది. అయితే శాంతికి 35 ఏళ్లు ఉన్నప్పుడు ఆమె భర్త సిద్ధార్ రాయ్ మరణించాడు.
నటి విజయేతా పండిట్ ఆదేశ్ శ్రీవాస్తవలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆదేశ్ క్యాన్సర్ బారిన పడి.. పోరాడి పోరాడి మరణించాడు. అయితే విజయేత మళ్ళీ పెళ్లి చేసుకుండా తన పిల్లలను ఒంటరిగా పెంచి పెద్దచేసింది.