బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే.. ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాలో నటించి మెప్పించింది ఈ చిన్నది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ చిన్నది.
బాలీవుడ్ లో శ్రద్దా కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. శ్రద్ధా ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆమె అభిమానులకు ఆకట్టుకుంటూనే ఉంది. ఈ అమ్మడికి బాలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
శ్రద్ధా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్గా ఉంటుంది. తరచూ తన ఫోటోలను తన అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ ఫొటోల్లో శ్రద్ధా మంచు పర్వతాల మధ్య ఎంజాయ్ చేస్తుంది. ప్రకృతిని ఆస్వాదిస్తోంది. దీంతో పాటు ఓ ప్రత్యేక నోట్ కూడా రాశారు. ఈ నోటు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శ్రద్ధా కపూర్ ఇలా రాసుకొచ్చింది. నన్ను పర్వతాల నుండి వెనక్కి తీసుకునే ధైర్యం ఎవరికి ఉంది? అని రాసుకొచ్చింది. పర్వతాల నడుమ ఆమె సరదాగా గడుపుతోన్న ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.