
హీరోయిన్లు వెకేషన్లకు వెళ్తున్నప్పుడు వెంట పిల్లలను తీసుకెళ్లడం చూస్తుంటాం. కొన్నిసార్లు సోలోగానూ వెళ్తుంటారు. ఫ్యామిలీ ట్రిప్పులూ ఉంటాయి. అలా పక్కా ఫ్యామిలీ ట్రిప్ ప్లాప్ చేశారు మిస్టర్ అండ్ మిసెస్ రణ్బీర్. వారిద్దరు రాహా పాపను కూడా వెంటబెట్టుకుని వెళ్లారు. అయితే వీరితోపాటు ఓ కెప్టెన్ కూడా ట్రావెల్ చేశారు... ఈ ట్రిప్కీ, వార్ సీక్వెల్కీ సంబంధం ఏంటి?

యానిమల్ సినిమా ఇచ్చిన కిక్ని ఇంకా ఆస్వాదిస్తున్నారు రణ్ బీర్ కపూర్. ఈ సినిమా చేసిన తర్వాత తండ్రిగా తన ప్రేమ వెయ్యింతలు పెరిగిందని చాలా సార్లు చెప్పారు రణ్బీర్. లేటెస్ట్ గా భార్య ఆలియా, పాప రాహాతో కలిసి ట్రిప్కి వెళ్లారు. వీరితో పాటు బ్రహ్మాస్త్ర కెప్టెన్ అయాన్ ముఖర్జీ కూడా ట్రావెల్ చేశారు.

అయితే వీరంతా కలిసి ఎక్కడికెళ్లారన్నది మాత్రం సస్పెన్స్. రణ్బీర్ కపూర్, ఆలియాకి అయాన్ ముఖర్జీ మంచి ఫ్రెండ్. అందుకే... వారంతా కలిసి ఏదైనా డెస్టినేషన్ ట్రిప్ ప్లాన్ చేశారేమో అనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అలా కాకపోయినా... బ్రహ్మాస్త్ర సీక్వెల్ కి సంబంధించి స్టోరీ సిట్టింగ్స్ ని కూడా ప్లాన్ చేసుకుని ఉండవచ్చు అనే మాటలూ ఉన్నాయి.

బ్రహ్మాస్త్ర సీక్వెల్ని వీలైనంత త్వరగా మొదలుపెట్టే అవకాశాలున్నాయన్నది బాలీవుడ్లో వినిపిస్తున్న మాట. మోస్ట్ ఎవెయిటింగ్ సీక్వెల్స్ లో బ్రహ్మాస్త్రకు బెస్ట్ ప్లేస్ ఉంది. బ్రహ్మాస్త్ర మూవీతో బేబీ రాహాను సిల్వర్స్క్రీన్ని పరిచయం చేస్తారేమోననే క్రేజీ థాట్స్ కూడా ఫ్యాన్స్ కు వస్తున్నాయి.

మరికొందరైతే మరో అడుగు ముందుకేసి, హృతిక్ - తారక్ నటిస్తున్న వార్2లోనే రాహా స్పెషల్ అప్పియరెన్స్ ఇప్పిస్తే బావుంటుందని మనసులోని మాటను బయటపెట్టేస్తున్నారు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఈ విషయాల గురించి మాట్లాడితేనే అసలు ట్రిప్ గురించి వివరాలు బయటికొస్తాయి.