
చాలా కాలం తరువాత ఫుల్ బిజీగా కనిపిస్తున్నారు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి. బాహుబలి తరువాత వరుస ఫెయిల్యూర్స్తో ఇబ్బందుల్లో పడ్డ ఈ బ్యూటీ, ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాల షూటింగ్లతో బిజీగా ఉన్నారు. ఇదే జోరులో సీక్వెల్ను కూడా పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు.

బాహుబలి షూటింగ్ టైమ్లోనే సైజ్ జీరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనుష్క శెట్టి, కెరీర్ను రిస్క్లో పడేసుకున్నారు. ఆ సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క తరువాత నార్మల్ లుక్లోకి రావటంలో ఇబ్బంది పడ్డారు. దీంతో అవకాశాలు తగ్గిపోయాయి. ఒకటి రెండు సినిమాలు చేసిన ఆ మూవీస్లో అనుష్క లుక్స్ మీద విమర్శలు వినిపించాయి.

ఆ తరువాత కూడా భాగమతి, నిశ్శబ్దం లాంటి సినిమాలు చేసినా... స్వీటీ రేంజ్కు తగ్గ హిట్ మాత్రం పడలేదు. దీంతో సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు అనుష్క శెట్టి. ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన అనుష్కకు అనుకున్న రేంజ్ సక్సెస్ అయితే దక్కలేదు.

ప్రజెంట్ మలయాళంలో కథనార్తో పాటు క్రిష్ దర్శకత్వంలో బైలింగ్యువల్ మూవీ ఘాటీలో నటిస్తున్నారు అనుష్క. ఈ రెండు సినిమాల షూటింగ్స్లో ప్యారలల్గా పాల్గొంటున్నారు. తాజాగా భాగమతి సీక్వెల్ను కూడా లైన్లో పెడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.

అరుంధతి తరువాత అనుష్క అంత పవర్ఫుల్ రోల్లో కనిపించిన సినిమా భాగమతి. అందుకే ఈ సినిమా సీక్వెల్ విషయంలో చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. తాజాగా కథ ఫైనల్ చేసిన దర్శకుడు అశోక్ త్వరలోనే సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు.