
యాంకర్ భాను శ్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే, బుల్లితెరపై నటిగా, యాంకర్గా ఈ బ్యూటీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా బిగ్ బాస్ షోకు వెళ్లి ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. బిగ్ బాస్ తర్వాత ఈ ముద్దుగుమ్మ లైఫే మారిపోయింది అని చెప్పాలి.

ఇక ఈ బ్యూటీ తెలంగాణలో జన్మించి, ఈముద్దుగుమ్మ అసలు పేరు భాను శ్రీ, గ్యాడ్యుయేషన్ పూర్తి చేసింది. చదువు మొత్తం హైదరాబాద్లో పూర్తి చేయడం జరిగింది. ఈ బ్యూటీకి చిత్రపరిశ్రమ అంటే చాలా ఇష్టం. దీంతో చదవు పూర్తి అయిన తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

జాబిలమ్మ సీరియల్తో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ మొదటి సీరియల్తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. దీంతో తర్వాత వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చి కుమారి 21 ఎఫ్, కాటమరాయుడు , ఇద్దరి మధ్య 18, బాహుబలి, ఏడు చేపల కథ ఇలా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.

అయితే బిగ్ బాస్ తర్వాత ఈ చిన్నది వరసగా సినిమాలు లేదా బుల్లితెరపై సందడి చేస్తుందని ఈ ముద్దుగుమ్మ అభిమానుల మురిసిపోయారు. కానీ, ఈ అమ్మడుకు ఆశించిన రేంజ్లో అవకాశాలు రాకపోవడంతో ఈ బ్యూటీ సోషల్ మీడియాకే పరిమితం అయ్యింది.

అప్పుడప్పుడు బుల్లితెరపై స్పెషల్ ఈ వెంట్స్లో సందడి చేస్తుంది. ఇక ఎప్పుడూ నెట్టింట్లో సందడి చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా, ఈ బ్యూటీ యువరాణిలా రెడీ, అయ్యి తన అంద చందాలతో ఆగం చేస్తుంది. క్యూట్ లుక్స్తో అందరినీ ఆకట్టుకుంటుంది. మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.