బాలీవుడ్ లో హాట్ బ్యూటీ అనన్య పాండేకి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు.
చుంకీ పాండే ముద్దుల కుమార్తె అయిన అనన్య పాండే.. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్–2' మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న చిత్రం లైగర్ లో నటిస్తోంది అనన్య.
'లైగర్'పై అనన్య ఎన్నో ఆశలు పెట్టుకుంది.
కేవలం నార్త్ కే పరిమితం కాకుండా.. 'లైగర్' ద్వారా వచ్చిన క్రేజ్ తో సౌత్ లోనూ సత్తా చాటాలని ఇక్కడి స్టర్ హీరోలతో కలిసి నటించాలని ముచ్చటపడింది.
లీగర్ లో అనన్య పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటే.. ఖచ్చితంగా ఆమె ఇక్కడ నిలదొక్కుకునే అవకాశాలు ఉంటాయి.
చూడాలి మరి ఈ అమ్మడి ఆశలు నెరవేరుతాయేమో చూడాలి.