
అటు గ్లామర్ ఇటు యాక్టింగ్ కలబోసిన కొద్ది మంది నటీమణులలో ఐశ్వర్య లక్ష్మి ఒకరు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

'యాక్షన్', 'జగమే తంత్రం' వంటి తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. సత్యదేవ్ హీరోగా నటించిన 'గాడ్సే' సినిమాతో ఐశ్వర్య లక్ష్మి టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

మలయాళం, తమిళ చిత్రాలతో పాపులర్ అయ్యింది ఐశ్వర్య లక్ష్మి. స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అటు బలమైన పాత్రలు పోషిస్తూ నటిగా ఆకట్టుకుంటూనే ఇటు, గ్లామర్ షో చేస్తూ మంత్రముగ్దుల్ని చేస్తుంది.

కంటెంట్ ఉన్న చిత్రాలతో మెప్పిస్తున్న ఐశ్వర్య లక్ష్మి సోషల్ మీడియాలోనూ జోరు పెంచుతుంది. అక్కడ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. పోటీ ప్రపంచంలోనూ తాను దూసుకుపోతుంది. నటనతో మెప్పించడమే కాదు, స్కిన్ షోతో, ఫోటో షూట్లతోనూ నెటిజన్లకి దగ్గరవుతుంది.

మలయాళంలో బలమైన కంటెంట్ ఉన్న చిత్రాలే చేసింది. ఇప్పుడు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ అలాంటి వాటికే ప్రయారిటీఇస్తుంది. పాజిటివ్, నెగటివ్ రోల్స్ చేసేందుకు వెనకాడటం లేదు.

తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులని మాయ చేసిందీ మలయాళీ కుట్టి. మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.

‘అమ్ము’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ భామ.. 'గార్గి', 'మట్టి కుస్తీ' సినిమాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న 'కింగ్ ఆఫ్ కోట'(KOK) సినిమాలో నటిస్తోంది.

ఇటీవల `మట్టికుస్తీ` చిత్రంలో అదరగొట్టిన విషయం తెలిసిందే. అందులో ఆమె కుస్తీ పోటీదారుగా ఆకట్టుకుంది. అత్యంత సంఘర్షణతో కూడిన పాత్రలో నటించి మెప్పించింది. నేటి కాలం అమ్మాయిలను ప్రతిబింబించింది.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఐశ్వర్య.. తరచుగా తన ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఐశ్వర్య లక్ష్మి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.