
ప్రస్తుతం అయ్యప్ప దీక్షలు కొనసాగుతున్నాయి. సామాన్యులతో పలువురు సినీ ప్రముఖులు అయ్యప్ప దీక్షలను స్వీకరించి శబరిమలకు యాత్రకు వెళుతున్నారు.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ లవ్ బర్డ్స్ సోనియా సింగ్- పవన్ సిద్దూలు కూడా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో పాలు పంచుకుంటున్నారు.

నటి సోనియా సింగ్ ప్రస్తుతం శివమాలలో ఉండగా, ఆమె బాయ్ ఫ్రెండ్ సిద్దూ పవన్ అయ్యప్ప మాలను స్వీకరించారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రాల్ని సందర్శిస్తున్నారు.

తమ ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారీ లవ్ బర్డ్స్. దీంతో ఇవి నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

కాగా యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన సోనియా సింగ్ సాయి దుర్గ తేజ్ విరూపాక్ష సినిమాతో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇక నితిన్, శ్రీలీల ఎక్స్ట్రార్డినరి మ్యాన్ లోనూ ఓ కామెడీ రోల్ తో ఆకట్టకుందీ అందాల తార.

శశి మథనం అనే ఓటీటీ సినిమాలోనూ మెరిసిన సోనియా సింగ్ పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లోనూ సందడి చేస్తుంటుంది.