
తెలుగులో వరుస సినిమాలతో తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్ రాశి ఖన్నా. ప్రస్తుతం ఈ అమ్మడు హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. ఇటీవలే సిద్ధార్థ్ మల్హోత్రా సరసన యోధ చిత్రంలో నటించింది. కానీ మీకు తెలుసా.. రాశి ఖన్నా చిన్నప్పటి నుంచి నటి కావాలని అనుకోలేదు.

రాశి ఖన్నా12వ తరగతిలో టాపర్గా నిలిచింది. రాశి IAS అధికారిణి కావాలని కలలు కన్నది. అందుకోసమే ఎక్కువగా చదువుతూ ఉండేది. కానీ అనుహ్యంగా సినిమాల్లోకి అడుగుపెట్టింది. మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు..ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. నెమ్మదిాగా అవకాశాలు అందుకుంది.

జాన్ అబ్రహం చిత్రం "మద్రాస్ కేఫ్" తో రాశి ఖన్నా తన కెరీర్ను ప్రారంభించింది. ఈ చిత్రంలో ఆమె పాత్ర చాలా చిన్నది. ఆ తర్వాత తెలుగు, తమిళంలో వరుస అవకాశాలు అందుకుంది. ఇప్పుడు ఈ అమ్మడు పాన్ ఇండియా హీరోయిన్.. నెట్టింట విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

మలయాళ పరిశ్రమలో, "విలన్" చిత్రంతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. కొన్ని రోజుల ఫర్జీ అనే వెబ్ సిరీస్ చేసింది. అయితే కొన్నాళ్లుగా తెలుగులో ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు తగ్గిపోయాయి. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

నీలిరంగు చీరలో గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది ఈ వయ్యారి. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత గోపిచంద్ సరసన జిల్ సినిమాలో మెరిసింది. ఈ బ్యూటీ అందాలకు ఇప్పుడు కుర్రకారు ఫిదా అవుతున్నారు