
న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్. ఆ తర్వా పలు చిత్రాల్లో నటించింది. s

అందం, అభినయం ఉన్నా... ఈ ముద్దుగుమ్మకు అదృష్టం మాత్రం అంతగా కలిసిరావడం లేదు. తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలు అంతగా రాలేదు.

దీంతో అటు తమిళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఓజీ చిత్రంలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

అలాగే కోలీవుడ్ హీరో ధనుష్ సరసన కెప్టెన్ మిల్లర్ చిత్రంలో నటించింది. ఈమూవీ ప్రమోషన్లలో భాగంగా మీడియాతో ఇంట్రాక్ట్ అయ్యింది ప్రియాంక.

అందులో గ్లామర్ సన్నివేశాల్లో నటిస్తారా ? అని ప్రశ్నించగా.. తనకు ఎక్కువగా గ్లామర్ సీన్లలో నటించడం ఇష్టం ఉండదని.. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే గ్లామర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటానని తెలిపింది.

ప్రియాంక మోహన్ చెప్పిన ఈ సమాధానానికి అభిమానుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. చాలా మంది నటీమణులు తమ అందచందాలకు హద్దులు లేకుండా నటిస్తుంటే, ప్రియాంక మాత్రం తనకంటూ ఓ లిమిట్ పెట్టుకుందని అంటున్నారు.