
తెలుగు, తమిళ చిత్రపరిశ్రమలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది హీరోయన్ ప్రియా భవాని శంకర్. అందం, అబినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొదట న్యూస్ రీడర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత 2014లో సీరియల్స్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు.

2017లో మేయా దమాన్ అనే సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టిన ఆమె.. కళ్యాణం కమనీయం అనే మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. ఇప్పటికీ కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాలతో అలరిస్తుంది.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, టాక్సిక్ రిలేషన్ షిప్ గురించి బయటపెట్టింది. తన మాజీ ప్రియుడి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. కాలేజీలో తాను ఒక అబ్బాయిని ప్రేమించానని.. కానీ అతడు చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశాడని.. అతడికి విధేయత లేదని తెలిపింది.

అలాంటి బంధంలో ఎక్కువకాలం ఉండాల్సిన అవసరం లేదని.. అలాంటి రిలేషన్ షిప్స్ కు బ్రేకప్ చెప్పేసి బయటకు రావాలని అన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవతున్నాయి. ప్రస్తుతం ఆమె తన స్నేహితుడు రాజ్ వేల్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది.

ప్రియా భవానీ శంకర్.. తెలుగులో భీమా, సత్యదేవ్ జోడిగా జీబ్రా సినిమాల్లో నటించింది. అలాగే ఇండియన్ 2, డిమోంటీ కాలనీ 2, బ్లాక్ వంటి చిత్రాల్లో నటించింది. గ్లామరస్ రోల్స్ కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటుంది ఈ అమ్మడు.