
క్రిష్ దర్శకత్వలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంచె సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ ప్రగ్యా జైస్వాల్.

అంతకు ముందు బిగ్ బాస్ ఫెమ్ అభిజిత్ హీరోగా నటించిన మిర్చిలాంటి కుర్రాడు అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది ప్రగ్యా జైస్వాల్.

కంచె సినిమా తర్వాత ఈ అమ్మడి రేంజ్ మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారిపోయింది. అలాగే క్రేజీ ఆఫర్స్ అందుకుంది ఈ హాట్ బ్యూటీ.

నటనతోనే కాదు అందంతోనూ ఆకట్టుకుంటుంది ప్రగ్యా జైస్వాల్. హీరోయిన్ గానే కాదు స్పెషల్ రోల్స్ లోనూ కనిపించి ప్రేక్షకులను మెప్పిస్తుంది.

సోషల్ మీడియాలో ఈ చిన్నది షేర్ చేసే ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. అందాల ఆరబోతకు ఏమాత్రం మొహమాట పడకుండా ఫోటోలకు ఫోజులిస్తుంది ప్రగ్యా జైస్వాల్.