కోలీవుడ్ హీరో విక్రమ్ హీరోగా నటించిన చిత్రం తంగలాన్. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా డైరెక్టర్ పా.రంజిత్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఆగస్ట్ 15న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ మాళవిక మోహనన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
తంగలాన్ నా జీవితంలో మర్చిపోలేని సినిమా అని.. ఈ చిత్రంలో చాలా విషయాలను నేర్చుకున్నట్లు తెలిపారు. తాను మేకప్ వేసుకోవడానికే దాదాపు నాలుగు గంటల సమయం పట్టిందని.. ఎక్కువగా ఎండలోనే షూటింగ్ చేశామని అన్నారు.
దీంతో తనకు శరీరంపై దద్దుర్లు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయని.. రోజూ సెట్స్ లో డెర్మటాలజిస్ట్, కళ్ల డాక్టర్ ఇలా మొత్తం ఐదుగురు డాక్టర్లు ఉండేవారని.. సినిమా కోసం చాలా కష్టపడ్డాడు చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఆశిస్తున్నామని అన్నారు.
మాళవిక మోహనన్ తమిళంలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే ప్రస్తుతం యంగ్ రెబల్ స్టా్ర్ ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.