ఎన్నికల హడావిడి ముగియటంతో మళ్లీ సినిమాల మీద ఫోకస్ చేశారు కంగనా రనౌత్. తను స్వయంగా డైరెక్ట్ చేసిన కాంట్రవర్షియల్ మూవీ ఎమర్జెన్సీ రిలీజ్ డేట్ను లాక్ చేశారు. అంతేకాదు ఆ తరువాత చేయబోయే సినిమాల విషయంలోనూ క్లారిటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
బాలీవుడ్ కాంట్రవర్షియల్ బ్యూటీ కంగనా రనౌత్ మళ్లీ ఫిలిం సర్కిల్స్లో ట్రెండ్ అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న ఈ బ్యూటీ, తిరిగి ఫోకస్ను సినిమాల మీదకు షిఫ్ట్ చేశారు.
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఎమర్జెన్సీ సినిమాను సెప్టెంబర్ 6న రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. యాక్చువల్గా ఎమర్జెన్సీ సినిమా ఎన్నికలకు ముందే రిలీజ్ కావల్సి ఉంది. ఆ ప్లాన్తోనే ప్రాజెక్ట్ను సిద్ధం చేశారు.
కానీ ఎందుకు మనసు మార్చుకున్నారో తెలియదు గానీ రిలీజ్ వాయిదా వేశారు. ఇప్పుడు ఎంపీగా గెలిచిన తరువాత ఎమర్జెన్సీని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.
ఈ సినిమాతో పాటు ఆల్రెడీ ఎనౌన్స్ అయిన మిగతా ప్రాజెక్ట్స్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు క్వీన్. సీత ది ఇన్కార్నేషన్ పేరుతో మైథలాజికల్ మూవీని ఎనౌన్స్ చేశారు కంగనా.
దీంతో పాటు తన ఇమేజ్ను మార్చేసిన క్వీన్ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందన్న హింట్ ఇచ్చారు. ఈ రెండు సినిమాలకు సంబంధించి అప్డేట్స్ కూడా త్వరలో రివీల్ చేసేందుకు రెడీ అవుతున్నారు.