
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ పవర్ ఫుల్ హీరోయిన్లలో కంగనా రనౌత్ ఒకరు. 2006లో సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఈ మద్దుగుమ్మ బాలీవుడ్ క్వీన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరనస నటించి స్టార్ డమ్ అందుకున్నారు. ప్రస్తుతం చంద్రముఖి 2లో నటిస్తున్నారు. మార్చి 23 కంగనా పుట్టినరోజు. ఈ సందర్బంగా బీటౌన్ ఫైర్ బ్రాండ్ గురించి ఆసక్తికర విషయాలు.

1987 మార్చి 23న హిమాచల్ ప్రదేశ్ లోని భమ్లాలోని రాజ్ పుత్ ఫ్యామిలీ కంగనా జన్మించారు. చిన్నవయసు నుంచే చాలా చురుకైన అమ్మాయి. చదువులో మేటి కంగనా.

తల్లిదండ్రులు కూతురిని డాక్టర్ చేయాలనుకున్నారు. కానీ సినిమాపై ఉన్న మక్కువతో మోడలింగ్ రంగంలోకి ప్రవేశపెట్టింది కంగనా. ఆ తర్వాత చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఏక్ నిరంజన్' చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఆమె నటించారు.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఏక్ నిరంజన్' చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఆమె నటించారు.

ఇండస్ట్రీలోని నెపోటిజంపై పోరాడిన ఆమె ఈ విషయంపై పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మణికర్ణిక ఫిల్మ్స్ అనే ప్రొడక్షన్ హౌస్ను స్థాపించి నిర్మాతగా మారారు. అటు దర్శకురాలిగానూ సక్సె్స్ అయ్యారు.

రాజపుత్ ఫ్యామిలీ నుంచి బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ వరకు.. కంగనా రనౌత్ సినీ ప్రయాణం ఆసక్తికర విషయాలు..