అందంగా లేదు.. జనాలకు నచ్చదు.. ఆమెను మార్చేయండి అంటూ ఎంతోమంది విమర్శించారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఇప్పుడు వరుస ఆఫర్స్ అందుకుంటుంది తెలుగమ్మాయి హిమబిందు.
ఈ అమ్మాయి టాలీవుడ్ ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు. కానీ తమిళంలో మాత్రం బుల్లితెరపై.. వెండితెరపై సత్తా చాటుతుంది. వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంటుంది.
తెలుగులో ప్రముఖ ఓటీటీ మాధ్యమం ఆహాలో 'మందాకిని' సిరీస్ ద్వారా అడియన్స్ ముందుకు వచ్చింది. ఇప్పుడు తమిళంలో మరో అవకాశం అందుకుంది హిమబిందు.
తమిళంలో లిథిర సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది హిమబిందు. అయితే ఇప్పుడు ఈ సీరియల్ నుంచి తప్పుకుంది. అందుకు కారణం ఆమెకు భారీ బడ్జెట్ ప్రాజెక్టులో అవకాశం రావడమే.
వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తోన్న కొత్త చిత్రంలో హిమబిందు ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇందులో మలయాళ నటుడు షేన్ నిగమ్ నటించనున్నాడు. కోలీవుడ్ ఇండస్ట్రీలో హిమబిందుకు మరిన్ని ఆఫర్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తోన్న కొత్త చిత్రంలో హిమబిందు ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇందులో మలయాళ నటుడు షేన్ నిగమ్ నటించనున్నాడు. కోలీవుడ్ ఇండస్ట్రీలో హిమబిందుకు మరిన్ని ఆఫర్స్ వచ్చినట్లు తెలుస్తోంది.