
సోషల్ మీడియాలో సంచలనం ఈ యంగ్ హీరోయిన్. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి పోటీ పడుతున్న నవతరం హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. తనే దర్శ గుప్తా.

బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన దర్శా.. రుద్ర తాండవం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా సక్సెస్ అయినా.. ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు మాత్రం రాలేదు.

అటు సోషల్ మీడియాలో నిత్యం చురుకుగా ఉంటూ ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంటుంది. సంప్రదాయ చీరకట్టులో.. లంగావోణిలో .. మోడ్రన్ డ్రెస్సులలో ఫోటోషూట్స్ చేస్తూ నెట్టింట షేర్ చేస్తుంటుంమది.

తాజాగా సంక్రాంతి పండగా సందర్భంగా ఈ అమ్మాడి షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. పింక్ అండ్ గ్రీన్ లంగావోణి అందమే అబ్బురపడేట్లుగా కనిపిస్తుంది ఈ అందాల తార.

ఈ పుత్తడి బొమ్మను చూస్తే అందానికే అసూయ పుట్టడం ఖాయమన్నట్లుగా కనిపిస్తోంది ఈ వయ్యారి. దర్శా గుప్తా చివరిసారిగా ఓ మై ఘోస్ట్ చిత్రంలో నటించింది దర్శా గుప్తా..