
తెలుగు సినీరంగంలో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇప్పుడు మనం మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం ఆ జాబితాలోకి చెందినవారే.

ఆమె మరెవరో కాదు. అమలా పాల్. అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో, రామ్ చరణ్ జోడిగా నాయక్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత భర్తతో విడాకులు వ్యక్తిగత జీవితంలో సమస్యలతో ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ గురించి మాట్లాడుతూ.. తన పెళ్లి గురించి ఓ జ్యోతిష్యూడు ముందే ఊహించారని అన్నారు. ఆ సమయంలో తనకు బాయ్ ఫ్రెండ్ కూడా లేరని.. ఆ తర్వాతే జగత్ దేశాయ్ తో పరిచయం ప్రేమ, పెళ్లి, ప్రెగ్నెన్సీ అన్నీ త్వరగా జరిగిపోయాయని తెలిపింది.

ఒక జ్యోతిష్యుడు తనను కలిసి త్వరలోనే ఆమెకు వివాహం జరుగుతుందని చెప్పారట. ఆ సమయానికి తనకు బాయ్ ఫ్రెండ్ కూడా లేదని.. అసలు పెళ్లి ఎలా జరుగుతుంది అని అనుకున్నానని ఆమె అన్నారు. ఆ తర్వాత జగత్ దేశాయ్ తో పరిచయం ప్రేమ, పెళ్లిగా మారిందని అన్నారు.

గత్ దేశాయ్ తో ప్రేమలో ఉన్నప్పుడే ఆమె ప్రెగ్నెంట్ అయ్యారు. ఆ పరిస్థితుల్లోనే వివాహం చేసుకున్నారు. తమ జీవితంలో ఇవన్నీ త్వరగా జరిగిపోయానని తెలిపింది. ఇప్పుడు ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది.