అవ్వడానికి తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళ్ సినిమాలతో పాపులర్ అయ్యింది ఐశ్వర్య రాజేష్. తమిళ్ లోనే హీరోయిన్ గా సినిమాలు చేసి ఆతర్వాత తెలుగులోకి అడుగు పెట్టింది ఈ టాలెంటెడ్ నటి.
కౌసల్య కృష్ణ మూర్తి అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైనా ఐశ్వర్య రాజేష్. వరుసగా సినిమాలు చేస్తూ అలరించింది. అలాగే పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గాను నటించింది. టాక్ జగదీశ్, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి సినిమాల్లో నటించింది.
ఇక తమిళ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ కనిపించి మెప్పించింది. ఐశ్వర్య ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కానీ ఒకప్పుడు ఈ అమ్మడు చాలా కష్టాలను ఎదుర్కొంది. అయినా కూడా ఎక్కడ తగ్గకుండా తానేంటో నిరూపించుకుంది.
అస్తోపోవధ్ యారు అనే తమిళ్ కామెడీ షోలో ఐశ్వర్య రాజేష్ యాంకర్గా తన కెరీర్ మొదలు పెట్టింది.ఆతర్వాత 2011లో అవగాళమ్ ఇవర్గలం సినిమాలో ఫ్రెండ్ పాత్రలో నటించింది. అలా ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె ఓ ఐదు సినిమాలు చేస్తోంది. తమిళ్లో రెండు, మలయాళంలో మూడు సినిమాలున్నాయి. తెలుగులో ఈ చిన్నదానికి అవకాశాలు తగ్గాయి.