Chandrababu Naidu: కియా పరిశ్రమ ముందు చంద్రబాబు సెల్ఫీ.. వైసీపీ ప్రభుత్వం అనంతపురానికి ఏం తెచ్చిందంటూ సవాల్..
పెనుగొండ లోని కియా కార్ల పరిశ్రమ వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫి తీసుకున్నారు.వైసీపీ ప్రభుత్వం అనంతపురం జిల్లాకు తెచ్చిన పరిశ్రమలు ఎన్నో? పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్ట్లు ఎన్నో చెప్పాలంటూ కియా పరిశ్రమ వద్ద సెల్ఫి దిగి సవాలు విసిరారు. టీడీపీ హయాంలో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి గొల్లపల్లి ప్రాజెక్ట్ నుంచి కియా కార్ల పరిశ్రమ అవసరాలకు నీటి సరఫరా చేశామని.. రికార్డ్ సమయంలో దాదాపు రూ.13 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమ ఏర్పాటు చేశామన్నారు.