ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది మవనున్న వ్యాధుల్లో కాన్సర్ ఒకటి. ఇది శరీర భాగముల్ ఎక్కడైనా సోకవచ్చు. కాన్సర్ రావటానికి అనేక రకాల ఆహార పదార్ధాలు కూడా కారణం కావచ్చు.ప్రతిరోజూ మనం తినే కొన్ని ఆహార పదార్థాలతో క్యాన్సర్ ముప్పు ఉంటుందని పరిశోధనల్లో తేలింది. అవేంటో ఇప్పుడు చూద్దాము.
ఆల్కహాల్ ఎక్కువగా తాగేవారిలో క్యాన్సర్ ముప్పు పెరుగుతోంది. అతిగా మందు తాగడం వల్ల కడుపు, పేగు, అన్నవాహిక, కాలేయం, ప్యాంక్రియాటిక్, రొమ్ము వంటి శరీర భాగాల్లో క్యాన్సర్ కణితులు ఏర్పడవచ్చు. ఆల్కహాల్ కారణంగా శరీర కణాల DNA మార్పులకు గురికావచ్చు. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
పంది మాంసం, గొర్రె మాంసం, గొడ్డు మాంసాలను రెడ్మీట్ అంటారు. దీన్ని తరచూ తింటే క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ముఖ్యంగా కొలొరెక్టల్ క్యాన్సర్ ముప్పు ఎక్కువ అవుతుంది. రెడ్మీట్లో సంతృప్త కొవ్వులు, సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.
కూల్డ్రింక్స్, సోడాలు, ఇతర షుగర్ డ్రింక్స్ హెల్త్కి అస్సలు మంచివి కాదు. వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. రోజుకు రెండు పైగా షుగర్ డ్రింక్స్ తాగే స్త్రీలలో క్యాన్సర్ రిస్క్ రెట్టింపు అవుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే అనేక రకాల జబ్బులకు కూడా ఇది కారణం అవుతాయి.
పాలు, జున్ను, పెరుగు వంటి పాల పదార్థాలను రెగ్యులర్గా, అతిగా తింటే ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. ఓ పరిశోధన ప్రకారం.. పాల ఉత్పత్తులు ఇన్సులిన్ లింక్ గ్రోత్ ఫ్యాక్టర్-1 (IGF-1) లెవల్స్ పెంచుతాయి. దీని ఫలితంగా ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది.
బాదం, అవిసె గింజలు, వాల్నట్స్, గుమ్మడి విత్తనాలు వంటి నట్స్, సీడ్స్లోని సమ్మేళనాలు, చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ క్యాన్సర్ కణాలపై పోరాడుతాయి. బీన్స్, పప్పు ధాన్యాలు వంటి వాటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొలొరెక్టల్ క్యాన్సర్ రిస్క్ను తగ్గిస్తుంది.