
నేటి ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది డయాబెటిస్ ఇబ్బంది పడుతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా మధుమేహం వెంటాడుతోంది. పూర్తిగా నివారించలేని షుగర్ వ్యాధిని మంచి లైఫ్స్టైల్ని పాటిస్తూ.. సరైన ఆహారాన్ని తీసుకుంటూ, శారీరక శ్రమ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే, షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు తక్కువ మోతాదులోనే తేనె తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

షుగర్ ఉన్నవారు తేనెను పరిమితంగానే వాడాలి. తేనెలో రోగనిరోధక శక్తి ఉన్నప్పటికీ ఇందులో చక్కెరలు అధికంగా ఉంటాయి.. తేనెలో ఉండే గ్లెసెమిక్ ఇండెక్స్ చక్కెర కంటే తక్కువ స్థాయిలో ఉంటుంది. కానీ ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతుంది. కాబట్టి తేనె విషయంలో జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి అంటున్నారు నిపుణులు.

తేనె తెల్ల చక్కెర కంటే తియ్యగా ఉంటుందని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి దీనిని తక్కువ పరిమాణంలో మాత్రమే వాడాలి. తేనెలోని చక్కెరలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. కాబట్టి మీ బ్లడ్షుగర్ ఎక్కువగా ఉంటే, మీరు తేనె తీసుకోవడం మానుకోవాలి. లేకపోతే, సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని సూచిస్తు్న్నారు.

మీరు సాధారణంగా చక్కెరను ఉపయోగించే చోట తేనెను తక్కువ మొత్తంలో ఉపయోగించవచ్చు. కానీ, తేనె తీసుకునే ముందు, మీరు మీ వైద్యుడిని సంప్రదించాలి. వైద్యుడిని సంప్రదించకుండా తేనె తీసుకోవడం ప్రమాదకరం. ఒక రోజుకు ఒక టీస్పూన్ కంటే ఎక్కువ తేనె తీసుకోవద్దు.

తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కనిపిస్తాయి. ఇది దగ్గును తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు కూడా దీన్ని తినాలి. మీకు చాలా ఉపశమనం లభిస్తుంది. తేనెలో యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కనిపిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.