
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. మార్చి 1వ తేదీ నుంచి యూటీఎస్ యాప్ పూర్తిగా బంద్ కానుంది. ప్రస్తుతం అన్ రిజర్వుడ్ జనరల్, ఫ్లాట్ఫామ్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే యూటీఎస్ యాప్ అందుబాటులో ఉండేది. దీని సేవలు ఇక నుంచి పూర్తిగా నిలిచిపోనున్నాయి. యాప్ ప్లే స్టోర్లో ఉన్నా.. దీని నుంచి ఇక మీరు ఎలాంటి బుకింగ్స్ చేసుకోలేరు. ఈ సేవలను మరో యాప్లోకి రైల్వేశాఖ మార్చుతోంది.

ఇకపై రైల్వే టికెట్ల బుకింగ్కు సంబంధించి రైల్ వన్ యాప్ ఏకైక ఫ్లాట్ఫామ్గా ఉంది. ఇక నుంచి రిజర్వ్డ్ లేదా అన్రిజర్వ్డ్, సబర్బన్. ఫ్లాట్ఫామ్ టికెట్లు అన్నీ రైల్ వన్ యాప్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రోజుల్లో్ యూటీఎస్ యాప్ ఆగిపోనుండటంతో.. అంతరాయాన్ని నివారించడానికి ఇప్పటినుంచే రైల్ వన్ యాప్ ఉపయోగించడం మంచిది.

గూగుల్ ప్లే స్టోర్ నుంచి రైల్ వన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి టికెట్లు సులువుగా బుక్ చేసుకోవచ్చు. యూటీఎస్ లాగిన్స్ లేదా ఐటీఆర్సీటీ రైల్ కనెక్ట్ లాగిన్స్ను ఉపయోగించి రైల్ వన్ యాప్లోకి లాగిన్ అవ్వొచ్చు. ప్రత్యేకంగా రైల్ వన్ యాప్ సేవల కోసం ప్రత్యేక అకౌంట్ను క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు.

రైల్వే ప్రయాణికులకు అవసరమైన అన్నీ సేవలు రైల్ వన్ యాప్లో అందుబాటులో ఉంటాయి. రిజర్వ్ చేయని సబర్బన్ టికెట్ కొనుగోలు చేయొచ్చు. ఇక మీరు వెళ్లాల్సిన రైలు లొకేషన్ను ట్రాక్ చేయవచ్చు. ఇక రిజర్వ్ చేయబడిన స్లీపర్ బెర్త్ను బుక్ చేసుకువచ్చు. అలాగే రైల్ మదద్ ద్వారా రైలు సేవలకు సంబంధించి ఫిర్యాదు కూడా చేయవచ్చు.

ఇక రైల్ వన్ యాప్ ద్వారా ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇక రైల్ వన్ యాప్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేస్తే టికెట్లపై 3 శాతం తగ్గింపు పొందవచ్చు. జనవరి 14 నుంచి ఈ ఆఫర్ అమల్లోకి రాగా.. జులై 14 వరకు అమల్లో ఉంటుందని రైల్వేశాఖ గతంలో ప్రకటించింది. రిజర్వ్ చేయని టికెట్ల కొనుగోలుపై ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుది.