
ప్రయాణికులకు రైల్వేశాఖ మరో గుడ్న్యూస్ అందించింది. ప్రయాణికుల రద్దీని పరిగణలోకి తీసుకున్న రైల్వేశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేర్వేరు ప్రాంతాల మధ్య తిరుగుతున్న ప్రత్యేక సర్వీసులను మరికొన్ని రోజుల పాటు పొడిగించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

సంత్రగాచి-యోలహంకా(02863) రైలును జనవరి 22వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు, యోలహంకా-సతంత్రగాచి(02864) రైలును ఈనెల 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు పొడిగించారు. ఇక షాలీమార్-చెన్నై(02841) రైలును ఫిబ్రవరి 2 నుంచి 23 వరకు పొడిగించారు.

చెన్నై సెంట్రల్-షాలీమార్(02842) రైలును ఫిబ్రవరి 4 నుంచి 25వ తేదీ వరకు సర్వీసులు అందించనుంది. ఇక కాకినాడ-మైసూర్(07033) ఫిబ్రవరి 2 నుంచి 27వ తేదీ వరకు. మైసూర్-కాకినాడ(07034) ఫిబ్రవరి 3 నుంచి 28 వరకు పొడిగించారు. ఇక నర్సాపూర్-బెంగళూరు(07153) ఫిబ్రవరి 6 నుంచి 27 వరకు అందుబాటులో ఉండనుంది.

ఇక బెంగళూరు-నర్సాపూర్(07154) రైలు ఫిబ్రవరి 7 నుంచి 28 వరకు పొడిగించారు. ఇక హైదరాబాద్-బెలగావి(07043) ఫిబ్రవరి 5 నుంచి 12 వరకు బెలగావి వరకు పొడిగించారు. బెలగావి-హైదరాబాద్(07044) ఫిబ్రవరి 6 నుంచి 13వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది.

సంక్రాంతి సందర్భంగా రైల్వేశాఖ ఇప్పటికే ప్రత్యేక రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ నెల చివరి వరకు స్పెషల్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు వీటిని తిప్పుతోంది.