
మధ్యాహ్నం 12 నుండి 4 గంటల మధ్య ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఏసీ ఆన్ చేస్తే గది చల్లబడటానికి ఎక్కువ సమయం పట్టి, కరెంట్ ఎక్కువగా ఖర్చవుతుంది. కాబట్టి ఉదయం పూట లేదా సాయంత్రం వేళల్లో బయట ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు ఏసీని ఆన్ చేయడం మంచిది. ఏసీని 24 నుండి 26 డిగ్రీల మధ్య సెట్ చేయండి. దీని వల్ల విద్యుత్ ఆదా అవ్వడమే కాకుండా మన శరీరానికి కూడా ఆరోగ్యకరమైన చల్లదనం లభిస్తుంది.

ఫ్యాన్ వాడకం: ఏసీ ఆన్ చేసిన వెంటనే ఫ్యాన్ను కూడా ఆన్ చేయండి. ఇది గదిలోని చల్లని గాలిని అన్ని మూలలకు త్వరగా వ్యాపింపజేస్తుంది. ఏసీ ఆన్ చేసిన తర్వాత గదిలోని చల్లదనం బయటకు పోకుండా తలుపులు, కిటికీలను సరిగ్గా మూసివేయాలి.

ప్రీ-కూలింగ్: మధ్యాహ్నం వేళ ఏసీ వాడకుండా, ఉదయమే ఏసీతో గదిని పూర్తిగా చల్లబరచండి. ఆ తర్వాత ఏసీ కట్టేసి, మధ్యాహ్నం వేళలో కేవలం ఫ్యాన్లతో ఆ కూలింగ్ను కాపాడుకోవచ్చు.

సాధారణ ఏసీల కంటే ఇన్వర్టర్ ఏసీలు విద్యుత్ను చాలా తక్కువగా వినియోగిస్తాయి. ఇవి గది ఉష్ణోగ్రతను బట్టి కంప్రెసర్ వేగాన్ని సర్దుబాటు చేసుకుంటాయి. స్మార్ట్ థర్మోస్టాట్స్ ఉపయోగించి ఏసీని మనకు కావాల్సిన సమయానికి ఆటోమేటిక్గా ఆన్,ఆఫ్ అయ్యేలా షెడ్యూల్ చేసుకోవచ్చు.

కిటికీలకు మందపాటి కర్టెన్లు వేయడం వల్ల సూర్యరశ్మి నేరుగా ఇంట్లోకి రాకుండా, గది వేడెక్కకుండా ఉంటుంది. ఇంటి చుట్టూ మొక్కలు పెంచడం వల్ల కూడా సహజంగానే ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.