Subhash Goud |
Updated on: Mar 07, 2021 | 10:37 PM
పోస్టల్ పథకాలకు సంబంధించి నిబంధనలలో మార్పులు జరిగాయి. పోస్టాఫీసు జీడీఎస్ (గ్రామీణ డాక్సేవ) బ్రాంచులలో క్యాష్ విత్ డ్రాయల్ లిమిట్ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 5 వేల రూపాయల నుంచి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాలు తాజాగా అమల్లోకి వచ్చాయి.
పోస్టల్ జీడీఎస్ బ్రాంచ్ల నుంచి 5వేలు కాకుండా ఇప్పుడు 20 వేల రూపాయలు విత్ డ్రా చేసుకునే సదుపాయం కల్పించింది పోస్టల్ శాఖ. బ్రాంచ్ పోస్టుమాస్టర్ రోజుకు ఒక అకౌంట్లో రూ.50 వేలకు మించి డబ్బు డిపాజిట్ చేయడానికి వీలులేదు. ఇంకా పలు అంశాలలో కూడా మార్పులు జరిగాయి.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, మంత్లి ఇన్కమ్ స్కీమ్, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఎన్ఎస్సీ తదితర పథకాల్లో డిపాజిట్ చేయడానికి కూడా విత్ డ్రా ఫామ్ లేదా చెక్ ఉపయోగించుకునే అవకాశం ఉంది. అలాగే సేవింగ్స్ ఖాతా కలిగిన వారు ఖచ్చితంగా రూ.500 మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాలి. అకౌంట్లో రూ.500 మినిమమ్ బ్యాలెన్స్ లేని పక్షంలో అకౌంట్ నుంచి రూ.100 కట్ అవుతాయి.