June: దేశ ప్రజలకు బిగ్ అలర్ట్.. జూన్ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి.. జరగనున్న మార్పులు ఇవే..
జూన్ నెల రానుండటంతో అనేక మార్పులు అమల్లోకి రానున్నాయి. బ్యాంక్ సెలవులు, గ్యాస్ సిలిండర్ల ధరలు, బ్యాంక్ డిపాజిట్లు, సోలార్ ప్యానెళ్ల ధరల వరకు అనేక మార్పులు జరగనున్నాయి. దేశ ప్రజలందరికీ ఇవి ప్రభావం చేయనున్నాయి. వీటి గురించి పూర్తి వివరాలు ఇలా..
రెండు రోజుల్లో జూన్ నెల వచ్చేస్తోంది. నెల మారుతుందంటే చాలు.. దేశ ప్రజలను ప్రభావితం చేసే అనేక మార్పులు అమల్లోకి వస్తాయి. ఆర్ధికపరంగా, ఇతర విషయాల్లో అనేక కొత్త మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా బ్యాంకు సెలవులు మారుతూ ఉంటాయి. బ్యాంకులతో ప్రతీఒక్కరూ అవసరముంటుంది. రోజువారీ లావాదేవీల పరంగా బ్యాంకులతో ప్రతీఒక్కరికీ పని ఉంటుంది. బ్యాంకు సెలవుల్లో ఏమైనా మార్పులు ఉంటే కస్టమర్లపై ప్రభావం పడుతుంది.
ఇక బ్యాంక్ సెలవులతో పాటు నెల మారుతుందంటే.. ఎల్పీజీ గ్యాస్ ధరల్లో సవరణలు జరుగుతాయి. ప్రతీ నెలా ఒకటో తేదీన చమురు కంపెనీలు కొత్త గ్యాస్ ధరలను ప్రకటిస్తాయి. గత మూడు నెలలుగా ధరలను పెంచగా.. ఈ సారి గ్యాస్ ధరలు ఎలా ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది. ఈ సారి కూడా పెంచుతారా.. లేదా స్థిరంగా ఉంచుతారా అనేది హాట్ టాపిక్గా మారింది.
జూన్ 1వ తేదీ నుంచి ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ కొన్ని అకౌంట్ల మెయింటైన్ రూల్స్ మార్చుతోంది. అందులో భాగంగా నోట్లు, కాయిన్స్ డిపాజిట్ల మీద చార్జీలు విధించనుంది. నోట్స్ డిపాజిట్పై 4 శాతం, కాయిన్ డిపాజిట్లపై 5 శాతం ఛార్జీలు విధించనుంది. అలాగే రూ.20 నోట్లు రూ.10 వేలు దాటకూడదు. ఇక కాయిన్స్ డిపాజిట్ రూ.5 వేలు దాటకూడదు.
లిమిట్ దాటితే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2 శాతం అదనంగా ఛార్జీ విధించనుంది. ఇక జూన్ 1 నుంచి సోలార్ ప్యానెళ్ల నిబంధనల్లో కేంద్రం మార్పులు చేసింది. ఇక నుంచి ప్రభుత్వం ఆమోదించిన సోలార్ ప్యానెళ్లు మాత్రమే వాడాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వ సబ్సిడీ అందుతుంది. దీని వల్ల జూన్ నుంచి సోలార్ ప్యానెళ్ల ధరలు పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ప్రజలకు నాణ్యమైన సోలార్ ప్యానెళ్లు అందించాలనే ఉద్దేశంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక జూన్లో బ్యాంక్ సెలవుల విషయానికొస్తే.. ఏపీలో మొహర్రం సందర్భంగా బ్యాంకులు మూతపడనున్నాయి. ఇక తెలంగాణలో జూన్ 2న రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం, మొహర్రం సందర్భంగా బ్యాంకులు ఉండవు. ఇక జూన్ 15,25,26,29,30న రెండు, నాలుగో శనివారాలు, ఆదివారం సందర్భంగా బ్యాంకులకు సాధారణ సెలవు వచ్చింది.