
టెక్ దిగ్గజం లెనోవో స్మార్ట్ఫోన్లతో పాటు ల్యాప్టాప్, ట్యాబ్ మార్కెట్లో దూసుకెళ్తోంది. తాజాగా, ఈ సంస్థ కొత్త ట్యాబ్లను విడుదల చేసింది. హై-ఎండ్ విభాగంలో ప్యాడ్ ప్రో, మిడ్-రేంజ్ విభాగంలో ప్యాడ్ ప్లస్ 11, లో ఎండ్ విభాగంలో ప్యాడ్ 11లను విడుదల చేసింది. ఈ ట్యాబ్లన్నీ స్నాప్డ్రాగన్ SoCs ప్రాసెసర్తో పనిచేస్తాయి. విడుదలైన మూడింటిలో లెనోవో ప్యాడ్ ప్రో 2021 అత్యంత ఖరీదైన, శక్తివంతమైన టాబ్లెట్లు.

ఈ స్లిమ్, లైట్వెయిట్ట్యాబ్ 5.8 మి.మీ. సైజు గల ఈ టాబ్లెట్ 485 గ్రాముల బరువు ఉంటుంది. ఈ టాబ్లెట్ దిగువన పోగో పిన్ కనెక్టర్, సైడ్-మౌంటెడ్ కెపాసిటివ్ను చేర్చింది. ఈ డివైజ్లో మొత్తం 6W అవుట్పుట్స్, డాల్బీ అట్మోస్ సపోర్ట్, నాలుగు JBL స్పీకర్లను జోడించింది. 90Hz హై రిఫ్రెష్ రేటు గల ఈ డివైజ్ 11.5 అంగుళాల OLED డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఇది డిస్ప్లే డాల్బీ విజన్, హెచ్డిఆర్ 10కు అనుకూలంగా ఉంటుంది.

ఈ ప్యాడ్ ప్రో 2021 క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 870 SoCతో పనిచేస్తుంది. ఇందులో 8GB ర్యామ్, 128GB యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ని అందించింది. దీనిలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ను అందించింది. దీని ముందు భాగంలో, టోఫ్ లెన్స్తో కూడిన 8 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాను కూడా చేర్చింది. 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గల ఈ ట్యాబ్లెట్లో 8600 ఎంఏహెచ్ బ్యాటరీని అందించింది. ఇది భారత మార్కెట్లో సుమారు రూ.25,500 ధర ఉండే అవకాశం ఉంది.

అలాగే లైనప్లోనే లెనోవో ప్యాడ్ ప్లస్ 11 పేరుతో విడుదలైన మిడ్ రేంజ్ ట్యాబ్లెట్ 11 అంగుళాల డిస్ప్లే కలిగి ఉంటుంది. టాప్ మోడల్ మాదిరిగా, దీనిలో కూడా క్వాడ్-స్పీకర్ సెటప్ను అందించింది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 750 జి SoC పనిచేసే ఈ ట్యాబ్లో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ చేర్చింది. ఇందులో వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలను చేర్చింది. క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0కి సపోర్ట్ గల ఈ ట్యాబ్ 7700 mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ధర సుమారు రూ.18,200 లభిస్తుంది.