Bullet Trains: దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రారంభానికి లైన్ క్లియర్.. ఎప్పుడంటే..?

Updated on: Apr 26, 2026 | 5:20 PM

దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఏడాదిలో జులైలో తొలి రైలును ప్రారంభించేందుకు రైల్వేశాఖ కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే స్వదేశీ టెక్నాలజీతో బుల్లెట్ రైళ్లను అభివృద్ది చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే..

1 / 5
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయంపై తొలి క్లారిటీ వచ్చింది. 2027 ఏప్రిల్ నాటికి దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. స్వదేశీ టెక్నాలజీతో తయారుచేస్తున్న తొలి బుల్లెట్ ట్రైన్ సుమారు గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. ఆత్మనిర్బర్ భారత్‌లో భాగంగా ఈ రైలును తయారుచేస్తున్నారు. మొదటి రైలును భారతీయ రైల్వే సహకారంతో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అభివృద్ది చేస్తోంది. ప్రస్తుతం హైస్పీడ్ బుల్లెట్ రైలు నమునా అభివృద్ది దశలో ఉంది.

దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయంపై తొలి క్లారిటీ వచ్చింది. 2027 ఏప్రిల్ నాటికి దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. స్వదేశీ టెక్నాలజీతో తయారుచేస్తున్న తొలి బుల్లెట్ ట్రైన్ సుమారు గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. ఆత్మనిర్బర్ భారత్‌లో భాగంగా ఈ రైలును తయారుచేస్తున్నారు. మొదటి రైలును భారతీయ రైల్వే సహకారంతో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అభివృద్ది చేస్తోంది. ప్రస్తుతం హైస్పీడ్ బుల్లెట్ రైలు నమునా అభివృద్ది దశలో ఉంది.

2 / 5
గంటకు 280 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేలా ఈ రైలు రూపొందించనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ స్వదేశీ తయారీ బుల్లెట్ రైళ్లను ప్రస్తుతం ప్రతిపాదించిన బుల్లెట్ రైళ్ల కారిడార్లతో పాటు భవిష్యత్ కారిడార్లలో నిర్మించనున్నారు. ప్రస్తుతం అహ్మదాబాద్-ముంబై హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్ పనులు జరుగుతుండగా.. జపాన్‌కు చెందిన షింకన్సెస్ టెక్నాలజీని ఉపయోగించి ఇండియా ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తుంది. దేశీయ సాంకేతికను అభివృద్ది చేయడం, విదేశీ వ్యవస్థలపై ఆధారపడటాన్ని ఇది తగ్గించనుంది.

గంటకు 280 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేలా ఈ రైలు రూపొందించనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ స్వదేశీ తయారీ బుల్లెట్ రైళ్లను ప్రస్తుతం ప్రతిపాదించిన బుల్లెట్ రైళ్ల కారిడార్లతో పాటు భవిష్యత్ కారిడార్లలో నిర్మించనున్నారు. ప్రస్తుతం అహ్మదాబాద్-ముంబై హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్ పనులు జరుగుతుండగా.. జపాన్‌కు చెందిన షింకన్సెస్ టెక్నాలజీని ఉపయోగించి ఇండియా ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తుంది. దేశీయ సాంకేతికను అభివృద్ది చేయడం, విదేశీ వ్యవస్థలపై ఆధారపడటాన్ని ఇది తగ్గించనుంది.

3 / 5
ఈ బుల్లెట్ రైళ్లలో అత్యాధునిక ఫీచర్లు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అలాగే అధునాతన భద్రతా వ్యవస్థలు ఉంటాయి. దిగుమతి చేసుకున్న ప్రత్యామ్నాయాల కంటే ఇది మరింత అనుకూలంగా ఉంటుంది. దేశ వాతావరణం, నిర్వహణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బుల్లెట్ రైళ్లను రూపొందిస్తున్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించుకుని దీనిని తయారుచేస్తున్నారు.

ఈ బుల్లెట్ రైళ్లలో అత్యాధునిక ఫీచర్లు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అలాగే అధునాతన భద్రతా వ్యవస్థలు ఉంటాయి. దిగుమతి చేసుకున్న ప్రత్యామ్నాయాల కంటే ఇది మరింత అనుకూలంగా ఉంటుంది. దేశ వాతావరణం, నిర్వహణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బుల్లెట్ రైళ్లను రూపొందిస్తున్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించుకుని దీనిని తయారుచేస్తున్నారు.

4 / 5
స్వదేశీ హైస్పీడ్ రైళ్లను అభివృద్ది చేయడం ద్వారా ఖర్చులు పెరుగుతాయి. అలాగే ఎగుమతులు, సాంకేతిక పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇందుకోసం డిజైన్, ఏరోడైనమిక్స్, భద్రతా ప్రమాణాలపై దృష్టి సారిస్తున్నారు. ప్రోటోటైప్‌ విషయంలో స్థిరమైన వేగంతో రైల్వేశాఖ పనిచేస్తోంది. ఇది పూర్తైన తర్వాత కఠిన పరీక్షలకు ఈ రైలు గురవుతుంది.

స్వదేశీ హైస్పీడ్ రైళ్లను అభివృద్ది చేయడం ద్వారా ఖర్చులు పెరుగుతాయి. అలాగే ఎగుమతులు, సాంకేతిక పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇందుకోసం డిజైన్, ఏరోడైనమిక్స్, భద్రతా ప్రమాణాలపై దృష్టి సారిస్తున్నారు. ప్రోటోటైప్‌ విషయంలో స్థిరమైన వేగంతో రైల్వేశాఖ పనిచేస్తోంది. ఇది పూర్తైన తర్వాత కఠిన పరీక్షలకు ఈ రైలు గురవుతుంది.

5 / 5
ఇటీవల బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా మొత్తం 7 బుల్లెట్ రైళ్లను ప్రతిపాదించారు. ఇందులో ముంబై-అహ్మదాబాద్‌తో పాటు హైదరాబాద్-బెంగళూరు, బెంగళూరు-చెన్నై, హైదరాబాద్-పుణె మార్గాలు ఉన్నాయి. వీటి నిర్మాణాలను ప్రారంభించేందుకు రైల్వేశాఖ వివిధ రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోంది. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది.

ఇటీవల బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా మొత్తం 7 బుల్లెట్ రైళ్లను ప్రతిపాదించారు. ఇందులో ముంబై-అహ్మదాబాద్‌తో పాటు హైదరాబాద్-బెంగళూరు, బెంగళూరు-చెన్నై, హైదరాబాద్-పుణె మార్గాలు ఉన్నాయి. వీటి నిర్మాణాలను ప్రారంభించేందుకు రైల్వేశాఖ వివిధ రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోంది. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది.

Follow Us